Komati Reddy Venkat Reddy: కాళేశ్వ‌రం అవ‌స‌రం లేకున్నా క‌ట్టారు

Komati Reddy Venkat Reddy: BRS ప్ర‌భుత్వం కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ అవ‌స‌రం లేక‌పోయినా క‌ట్టి ప్ర‌జ‌ల సొమ్ము వృథా చేసింద‌ని అన్నారు కాంగ్రెస్ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. రాజ‌కీయాలంటే తెలీని వేస్ట్ ఫెలోకి మంత్రి ప‌ద‌వి ఇస్తే వాడు దోపిడీకి అల‌వాటు ప‌డి సాదా సీదాగా నిర్మాణాలు చేయించేసి ప్ర‌జ‌ల‌కు ఈరోజు నీళ్లు లేకుండా చేసార‌ని ఆరోపించారు. (Komati Reddy Venkat Reddy)

మూడేళ్ల‌కే కూలిన మేడిగ‌డ్డ‌

కాళేశ్వ‌రం (మేడిగ‌డ్డ బ్యారేజ్) క‌ట్టిన మూడేళ్లకే కూలిపోయింది. అదికాకుండా స‌రిగ్గా తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే బ్యారేజ్ కూలిపోవ‌డంతో ప్ర‌జ‌ల‌కు BRS ప్ర‌భుత్వంపై పూర్తిగా న‌మ్మ‌కం పోయింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం క‌ట్టించిన ఒక్క డ్యాంకు ఒక్క చిన్న క్రాక్ కూడా రాలేద‌ని కమిష‌న్ల కోసం దోచుకునేందుకే కాళేశ్వ‌రం క‌ట్టార‌ని ఆరోపించారు.