హిజ్రాగా మారిన‌ ఇద్దరు పిల్లల తండ్రి.. మూర్ఛపోయిన భార్య

పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టాక ఇంట్లో నుంచి పారిపోయి లక్ష్మణరావు అనే వ్యక్తి హిజ్రాగా మారిన ఘ‌టన క‌ర్ణాట‌క‌లో చోటుచేసుకుంది. విషయం తెలియని భార్య 7 ఏళ్లుగా పిల్లలతో పుట్టింట్లో ఉంటోంది. ఇటీవల కన్నడ బిగ్ బాస్ షోలో వనజాక్షి అనే హిజ్రా పాల్గొంది. ఆ వీడియో చూసిన భార్యకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వనజాక్షిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. తీరా చూస్తే ఆ వ‌నజాక్షి ఎవ‌రో కాదు త‌న భ‌ర్తే అని తెలుసుకున్న ఆ మ‌హిళ పోలీసులు ముందే స్పృహ‌కోల్పోయింది. లింగమార్పిడి చేయించుకున్నానని ల‌క్ష్మ‌ణ‌రావు పోలీసుల‌తో చెప్పారు. ఇప్పుడు వారి స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించాలో తెలీక పోలీసులు త‌ల‌ప‌ట్టుకున్నారు.