EXCLUSIVE: క‌థ మ‌ళ్లీ మొద‌టికే..!

EXCLUSIVE: YSRCP అస‌మ్మ‌త నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై (balineni srinivas reddy) అధిష్ఠానం సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డిని నియ‌మించ‌డం ప‌ట్ల బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. మాగుంట‌ని కాకుండా భాస్క‌ర్‌రెడ్డికి ఇస్తే ఒప్పుకునేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఆ త‌ర్వాత పార్టీకి లేని బాధ నాకెందుకు అని ఈ టాపిక్‌ని వ‌దిలేసారు. కానీ ఆయ‌న చ‌ర్య‌ల కార‌ణంగా ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికే రావ‌డంతో YCP హై క‌మాండ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దాంతో బాలినేని ఒంగోలు నుంచి హైద‌రాబాద్ వెళ్లిపోయిన‌ట్లు తెలుస్తోంది.