Poonam Kaur: చిరంజీవికి ప‌ద్మ‌విభూష‌ణ్‌..BRS ప‌త్రిక త‌ప్పుడు ప్ర‌చారం

Poonam Kaur: మెగాస్టార్ చిరంజీవికి (chiranjeevi) ప‌ద్మ‌విభూష‌ణ్ రావ‌డంపై న‌టి పూన‌మ్ కౌర్ స్పందించారు. క‌రోనా స‌మ‌యంలో ఎంతో సేవ చేసిన సోనూ సూద్ (sonu sood) వంటి వ్య‌క్తులు ఇలాంటి అవార్డుల‌కు అర్హుల‌ని కాక‌పోతే సోనూ సూద్ ఎలాంటి పొలిటిక‌ల్ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌రు కాబ‌ట్టి ఆయ‌న‌కు అవార్డు రాలేదు అన్న‌ట్లు ఓ పోస్ట్ పెట్టారు.

అయితే ఈ అంశంపై దిశా అనే వెబ్‌సైట్ వార్త రాస్తూ చిరంజీవికి ప‌ద్మ విభూష‌ణ్ రావ‌డంపై పూన‌మ్ కౌర్ మండిపాటు అన్న‌ట్లుగా రాసేసారు. దాంతో పూన‌మ్ ఆ వెబ్‌సైట్‌ను ట్యాగ్ చేస్తూ.. ఇది BRS న‌డిపిస్తున్న ప‌త్రిక క‌దా? ద‌య‌చేసి ఎవ‌రైనా క‌న్ఫామ్ చేయండి అని ట్విట‌ర్ ద్వారా అడిగారు. దీనికి ప‌లువురు నెటిజ‌న్లు స్పందిస్తూ.. ఇది తెలుగు దేశం పార్టీ (TDP) న‌డిపిస్తున్న ప‌త్రిక అని.. చిరంజీవికి అవార్డు రావ‌డం తెలుగు దేశం పార్టీ నేత‌లు త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని కామెంట్స్ చేస్తున్నారు.