Chandrababu Naidu: అలాంట‌ప్పుడు నేను రాజ‌కీయాల్లో ఎందుకుండాలి?

Chandrababu Naidu: ప్ర‌జల‌కు నా అవ‌స‌రం లేన‌ప్పుడు వారు న‌న్ను వ‌ద్దు అనుకున్న‌ప్పుడు నేను రాజకీయాల్లో కొనసాగ‌డం ఎందుకు? ఈ ప్ర‌శ్న 2019 ఎన్నిక‌ల త‌ర్వాత తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స్వ‌యంగా అన్నారు. ఆ స‌మ‌యంలో ప్ర‌ముఖ యాంక‌ర్ అర్న‌బ్ గోస్వామితో డిబేట్‌లో పాల్గొన్న చంద్ర‌బాబు.. ఈ వ్యాఖ్య‌లు చేసారు. ఓడిపోతే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాను అని కూడా ప్ర‌క‌టించారు. 2019లో ఓడిపోయిన చంద్ర‌బాబు మ‌రి ఇప్పుడెందుక జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుని మ‌రీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నారు అంటూ ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు అప్ప‌టి వీడియోని పెట్టి ట్రోల్ చేస్తున్నారు.