EXCLUSIVE: “ఎంపీ ప‌ద‌వి వ‌ద్దు.. ఫోర్స్ చేస్తే TDPలోకే పోతాం”

EXCLUSIVE: రాజ్య‌స‌భ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు YCP నేత‌లు సిద్ధంగా లేరు. త‌మ‌కు ఎంపీ స్థానం వ‌ద్దంటే వ‌ద్దు అని క‌రాఖండిగా చెప్పేసారు. దాంతో ఏపీ సీఎం జ‌గన్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) త‌న ఎమ్మెల్యేల‌నే ఎంపీ స్థానాల్లో నిల‌బెట్టేందుకు యోచిస్తున్నారు. ఇందుకు ఎమ్మెల్యేలు కూడా ఒప్పుకోవ‌డంలేదు. తాము పోటీ చేస్తే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మాత్ర‌మే పోటీ చేస్తామ‌ని.. బ‌ల‌వంతంగా ఎంపీ స్థానానికి పోటీ చేయిస్తే రాజీనామాలు చేసి తెలుగు దేశం పార్టీలో (TDP) చేర‌తామ‌ని హెచ్చ‌రిస్తున్నారట‌. ఏపీలో మూడు ఎంపీ స్థానాల‌కు గానూ రాజ్య స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే.