EXCLUSIVE: నేను గెల‌వాలి.. మీకేం కావాలి?

EXCLUSIVE: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) త్వ‌ర‌లో ఢిల్లీకి పర్య‌టించ‌నున్నారు. BJP పెద్ద‌ల‌తో ఆయన భేటీ కానున్నారు. అయితే ఆయ‌న అక్క‌డ చ‌ర్చించాల్సిన అంశాలు బ‌య‌టికి లీక్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌ల్లో నేను గెల‌వాలి.. మీరే దిక్కు. ఇందుకు మీకేం కావాలి? నాకేం ఇస్తారు అనే అంశాల‌పై జ‌గ‌న్ చ‌ర్చించ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఏపీ నుంచి మూడు రాజ్యస‌భ సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ రిలీజ్ అయింది. ఈ విష‌యం గురించి చ‌ర్చిస్తూనే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు సాయం కావాల‌ని జ‌గ‌న్ కోర‌నున్నారు. ఇందుకు బ‌దులుగా కేంద్ర‌మంత్రి అమిత్ షా (amit shah) సూచించిన వ్య‌క్తికే రాజ్య‌స‌భ సీటు ద‌క్కేలా జ‌గ‌న్ చూస్తాన‌ని హామీ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.