TDP vs Janasena: స్టేజ్‌పైనే ర‌చ్చ‌.. ప‌డ‌బోయిన చంద్ర‌బాబు..!

TDP vs Janasena: తెలుగు దేశం పార్టీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య గొడ‌వ ఇప్పుడు తీవ్రమైన‌ట్లు క‌నిపిస్తోంది. TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) రాజ‌మండ్రిలో రా క‌ద‌లిరా కార్య‌క్ర‌మం చేప‌డుతున్న స‌మ‌యంలో TDP నేత బొడ్డు వెంక‌ట ర‌మ‌ణ మ‌ద్ద‌తుదారులు స్టేజ్‌పైకి ఎక్కి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) నిర్ణయాన్ని వ్య‌తిరేకిస్తూ ర‌చ్చ చేసారు. దాంతో స్టేజ్‌పై ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. కార్య‌క‌ర్త‌లు ఒక‌రినొక‌రు తోసుకోవ‌డంతో చంద్ర‌బాబు నాయుడు స్టేజ్‌పై నుంచి ప‌డబోయారు. వెంట‌నే సిబ్బంది ఆయ‌న్ను ప‌ట్టుకున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ రాజోలు, రాజాన‌గ‌రం నుంచి పోటీ చేస్తుంద‌ని ఎప్పుడైతే ప్ర‌క‌టించారో అప్పుడే తెలుగు దేశం జ‌న‌సేన పార్టీలో ముస‌లం ఏర్ప‌డింది.