Rangareddy: దారుణం.. తండ్రిపై ఇనుప‌ రాడ్డుతో దాడి

Rangareddy: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ తగాదాలతో రాకేష్ అనే యువ‌కుడు తండ్రితో పాటు మేనమామపై ఇనుప రాడ్డుతో దాడి చేసాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. పోలీసులు రాకేష్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.