EXCLUSIVE: ప‌వ‌న్ అలా చేయ‌కుండా ఉండాల్సింది

EXCLUSIVE: జ‌న‌సేన (janasena) రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేయ‌నుంద‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) ప్ర‌క‌టించ‌డంపై తెలుగు దేశం పార్టీ (TDP) అసంతృప్తిగా ఉన్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. రాజోలు, రాజాన‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గాల నుంచి జ‌న‌సేన పోటీ చేయ‌నున్న‌ట్లు ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. అయితే ప‌వ‌న్ ఇలా ప్ర‌కటించ‌కుండా ఉండాల్సింది అని తెలుగు దేశం పార్టీ హై క‌మాండ్ అభిప్రాయ‌ప‌డింది.

అయితే ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌పై బ‌హిరంగంగా ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్ట‌కూడ‌ద‌ని తెలుగు దేశం పార్టీ కేడ‌ర్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీని వ‌ల్ల అపోజిష‌న్ పార్టీల‌కు ఊత‌మిచ్చిన‌ట్లు అవుతుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. రాజోలులో తెలుగు దేశం పార్టీ భారీ మెజారిటీతో గెలిచే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ జ‌న‌సేన రాజోలు నుంచి పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో తెలుగు దేశం పార్టీ నేత‌లు షాక‌య్యారు.