YS Sharmila: మ‌న కుటుంబం చీలింది నీ వ‌ల్లే జ‌గ‌న్ అన్నా..!

YS Sharmila: త‌మ కుటుంబం చీలింది అంటే అందుకు కార‌ణం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) అని సంచ‌ల‌న కామెంట్స్ చేసారు ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ‌. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ జైల్లో ఉంటే తాను వెన్నంటే ఉండి ఎన్నో వేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేస్తే ఆయ‌న‌కు అధికారం వ‌చ్చింద‌ని.. ఇందుకు త‌న త‌ల్లి విజ‌య‌మ్మే సాక్షి అని తెలిపారు.

జ‌గ‌న్ మాట్లాడితే కుటుంబం చీల్చారు అని అంటున్నార‌ని అది ఆయ‌న చేతులారా చేసుకున్నార‌ని ఆరోపించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం దీన స్థితిలో ఉందంటే అందుకు కార‌ణం చంద్ర‌బాబు నాయుడు, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని విమ‌ర్శించారు. ఎప్పుడు అవ‌స‌రం ఉంటే అప్పుడు జ‌గ‌న్‌కు అండ‌గా ఉన్నాన‌ని ఏది కావాల‌ని అడిగినా మాట మాట్లాడ‌కుండా ఎందుకు అని అడ‌గ‌కుండా స్వ‌లాభం చూసుకోకుండా నిస్వార్ధంగా ప‌ని చేసాన‌ని అన్నారు.