EXCLUSIVE: రేవంత్‌ని క‌లుస్తూనే ఉంటాం.. చ‌చ్చేవ‌ర‌కు BRS లోనే ఉంటాం

EXCLUSIVE: BRS ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డితో (mahipal reddy) పాటు మ‌రికొంద‌రు నేత‌లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని (revanth reddy) క‌ల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వారంతా కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్నారంటూ ప్ర‌చారం జరుగుతోంది. దీనిపై మ‌హిపాల్ రెడ్డి స్పందిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం, నియోజకవర్గ ప్రయోజనాల కోసం సీఎంని వెయ్యి సార్లు అయినా కలుస్తాం.. చచ్చే వరకు BRS పార్టీలోనే ఉంటాం అని తేల్చి చెప్పారు. అన‌వ‌స‌రంగా తాము పార్టీ మారుతున్నామ‌ని లేనిపోనివి క‌ల్పించి రాయ‌కండి అని మీడియా వ‌ర్గాల‌ను కోరారు.