EXCLUSIVE: మేడిగ‌డ్డ బ్యారేజ్.. బ‌య‌ట‌ప‌డ్డ‌ సంచ‌ల‌న విష‌యాలు

EXCLUSIVE: ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్మిత‌మైన మేడిగ‌డ్డ బ్యారేజ్‌పై (medigadda barrage) తెలంగాణ విజిలెన్స్ బృందం ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించింది. విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో సంచలన విషయాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. 3,200 కోట్ల ప్రజాధనం నిర్మాణం పేరుతో వృథా చేశారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం మధ్యంతర నివేదికను సిద్ధం చేసింది.

వారం రోజుల్లో ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక స‌మ‌ర్పించ‌నున్నారు. నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు దోషులేన‌ని తేల్చి చెప్పారు. వరద ఉద్ధృతి అంచనా లేకుండానే డిజైన్ చేసార‌ని బ్యారేజ్‌ కుంగడం అకస్మాత్తుగా జరిగింది కాదని విజిలెన్స్ బృందం ఆరోపిస్తోంది.