Devarakonda: గురుకులంలో బాలిక అనుమానాస్పద మృతి

Devarakonda: దేవరకొండలోని కొండమల్లేపల్లి ఎస్సీ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్ప‌ద మృతిచెందింది. విద్యార్థిని భార్గవి నిన్న‌ ఉదయం ప్రేయర్ చదువుతుండగా స్పృహతప్పి కింద పడిపోయింది. పాఠశాల సిబ్బంది హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భార్గవి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే బాలిక మృతిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు, పలువురు హైవేపై ధర్నాకు దిగారు.