ప్రియాంక‌ను గెంటేసారు.. అత‌న్ని బొక్క‌లో వేయాలి

బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసారు. గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రాకు అన్యాయం జరిగింది అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేసారు. మిస్ వ‌రల్డ్ అయ్యాక ప్రియాంక‌కు బాలీవుడ్‌లో మంచి అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుని స్టార్‌డం సంపాదించుకున్నారు. ఆ త‌ర్వాత ఆమె టాలెంట్‌తో ప‌లు ఇంగ్లీష్ ఆల్బ‌మ్స్‌లో న‌టించి హాలీవుడ్ సినిమాల్లోనూ ఛాన్స్ కొట్టేసారు. ఇప్పుడు గ్లోబ‌ల్ స్టార్‌గా స‌మాన‌మైన రెమ్యునరేష‌న్ అందుకుంటూ వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్నారు. అయితే తాను ఇండియా వ‌దిలి అమెరికా వెళ్లిపోవ‌డానికి కార‌ణం బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న‌కు ఎద‌రైన రాజ‌కీయాలే అని ప్రియాంక ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

“నేను ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు వ‌చ్చాక కొంద‌రు నాతో రాజ‌కీయాలు చేయాల‌ని చూసారు. కొంద‌రితో మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చాయి. న‌న్ను ప‌క్క‌కు నెట్టేసారు. నాకు ఛాన్సులు రాకుండా చేయ‌డానికి చాలా ప్ర‌య‌త్నించారు. ఇలాంటి ప్ర‌వర్త‌న‌ల‌తో విసిగిపోయాను. అందుకే బాలీవుడ్‌కు దూరంగా ఉండాల‌ని అనుకున్నా. అదే స‌మ‌యంలో నేను ఒక ఇంగ్లీష్ అల్బ‌మ్‌లో న‌టించా. అది చూసిన నా మేనేజ‌ర్‌.. హాలీవుడ్‌లో ట్రై చేస్తావా అని స‌ల‌హా ఇచ్చింది. అలా త‌న‌కు తెలిసిన కాంటాక్ట్స్‌తో హాలీవుడ్‌లో అవ‌కాశాలు తెచ్చుకున్నా” అని ప్రియాంక త‌నకు ఎదురైన అనుభ‌వాలు తెలిపారు.

ఈ విష‌యంపై కంగ‌న ట్విట‌ర్ ద్వారా స్పందించారు. “ప్రియాంక‌ను బాలీవుడ్ త‌క్కువ చేసి మాట్లాడింది. ఆమెపై గ్యాంగ్ వార్స్ చేసారు. బాలీవుడ్‌ను వ‌దిలి వెళ్లిపోయేలా వెంబ‌డించారు. త‌న‌కంటూ ఇండ‌స్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక‌ను ఇండియా వ‌దిలివెళ్లిపోయేలా చేసారు. దీని వెనక ఉన్న‌ది నిర్మాత క‌ర‌ణ్ జోహారే అని అంద‌రికీ తెలుసు. ప్రియాంక షారుక్ ఖాన్‌తో ఫ్రెండ్లీగా ఉండ‌టం క‌ర‌ణ్‌కు న‌చ్చ‌లేదు. దాంతో క‌ర‌ణ్‌, ప్రియాంక‌ల‌కు మ‌ధ్య విబేధాలు వ‌చ్చాయి. ఈ విష‌యం గురించి చాలా ప‌త్రిక‌లు రాసాయి. ఇలాంటి వాళ్ల వ‌ల్ల దెబ్బ‌తింటున్న చిత్ర ప‌రిశ్ర‌మ‌ను వారి నుంచి కాపాడాలి. అమితాబ్ బ‌చ్చ‌న్, షారుక్ ఖాన్ ఉన్న స‌మ‌యంలో ఇండ‌స్ట్రీ బాగుండేది. ఇప్పుడు అలా లేదు. రాజ‌కీయాలు ఎక్కువ‌య్యాయి. క‌ర‌ణ్ మాఫియా గ్యాంగ్‌ను, అత‌ని పీఆర్‌ను బ్యాన్ చేయాలి. వారిపై రెయిడ్లు నిర్వ‌హించి అత‌నిపై చ‌ర్య‌లు తీసుకోవాలి” అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు కంగ‌న‌