కంట‌త‌డిపెట్టిస్తున్న దంప‌తుల వీడియో.. సూసైడ్‌కి ముందు ఏం చేశారంటే!

ఆర్దిక ఇబ్బందులు ఆ దంపతులను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి. వారు చేసిన అప్పులేమో తీర్చలేని స్థాయికి వెళ్లాయి. అందరూ ఇంటికి వచ్చి అడుగుటుంటే.. రోజూ ఎంతో కృంగిపోయేవారు. ఇక చేసిన అప్పులు తీర్చే మార్గం లేదనుకున్నారో ఏమో.. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించారు. ఈక్రమంలో తమ బిడ్డల గురించి ఆలోచించారు.. కానీ వాళ్లను అనాథలుగా వదిలేస్తున్నామని వారు అనుకోలేదు. ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయని ఇక తమకు చావే శరణ్యమని ఓ సెల్ఫీ వీడియో తీశారు. దాదాపు మూడు నిమిషాలపాటు భార్యాభర్తలు ఇద్దరూ ఏడుస్తూనే తాము ఎందుకు చనిపోతున్నామో చెబుతూనే… తమ కన్న బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవాలని బంధువులకు చెప్పిన తీరు అందరినీ కలచివేస్తోంది. ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందంటే?

విశాఖపట్నంలోని వడ్లపూడి తిరుమలానగర్‌కు చెందిన వరప్రసాద్ దంపతులు తాము ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు సోమవారం సాయంత్రం వారు ఉంటున్న ఇంట్లోనే ఓ సెల్ఫీ వీడియోలో చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నామని కుమారుడు, బంధువులకు సెల్ఫీ వీడియో తీసి పంపారు. ‘‘ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాము. ఇక మేము వెళ్తున్నాం.. మీరు జాగ్రత్త.. అమ్మ‌మ్మను చూసుకోండి. అల్లుడు గారు మా కుమార్తెను బాగా చూసుకోండి. మీకు ఇవ్వాల్సినవి ఇవ్వలేకపోతున్నాము ఏమీ అనుకోవద్దు. నా కొడుకుని కూడా చూసుకోండి బాబాయి అంటూ’’ సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యారు. ‘మా పిల్లలను బాగా చూసుకోండి అంటూనే.. పిల్లలకు సైతం పెద్దవాళ్లు చెప్పిన మాట వినండి అని ఆ దంపతులు తీసిన వీడియో కన్నీరు తెప్పిస్తోంది. ఇక ఈ వీడియో చూసిన కుమారుడు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే దంపతుల కోసం గాలించడం మొదలుపెట్టారు. అయినప్పటికీ వారి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే అనకాపల్లి జిల్లాలోని ఏలూరు కాలువ వద్ద దంపతుల బ్యాగు, దుస్తులు లభ్యమయ్యాయి. దీంతో వారు ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులకు దంపతుల కుమారుడు కృష్ణతేజ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దంపతుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.