Telangana: 25 రోజుల పాటు క‌రెంట్ క‌ట్

Telangana: హైద‌రాబాద్‌లో దాదాపు 25 రోజుల పాటు ప‌వ‌ర్ క‌ట్స్ ఉండ‌బోతున్నాయి. ఈరోజు నుంచి విద్యుత్ స‌బ్ స్టేష‌న్ల‌లో మ‌ర‌మ్మ‌తులు జ‌ర‌గ‌నున్నాయి. 15 నిమిషాల నుంచి 2 గంట‌ల పాటు ఈ రిపేర్లు జ‌రుగుతాయి. రిపేర్ జ‌రుగుతున్నంత సేపు విద్యుత్ క‌నెక్ష‌న్లు క‌ట్ అవుతాయి. ఆదివారాలు, పండుగ‌ల నాడు ఈ మ‌ర‌మ్మ‌తులు ఉండ‌వు. హైద‌రాబాద్‌లోని వివిధ స‌బ్ స్టేష‌న్ల ప‌రిధిలో రొటేష‌న్ ప‌ద్ధ‌తిలో అధికారులు రిపేర్లు చేయ‌నున్నారు. వేస‌విలో అత్య‌ధికంగా విద్యుత్‌కు డిమాండ్ ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ముందుగానే త‌గిన ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.