Guntur Kaaram: సైబ‌ర్ కేసు వేసిన టీం

Guntur Kaaram: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu) న‌టించిన గుంటూరు కారం టీం సైబ‌ర్ కేసు వేసింది. 70,000 ఫేక్ ఓట్లతో బుక్ మై షోలో గుంటూరు కారం రేటింగ్‌ని తగ్గించే కుట్ర పన్నారంటూ సైబర్ క్రైమ్‌ కేసు నమోదు చేసింది. బుక్ మై షోకి కూడా దీని వెనక ఉన్నది ఎవరో కనుక్కోవాలంటూ లీగల్ నోటీసులు పంపింది. కావాలనే తగ్గించే ప్రయత్నం జరిగిందా? కుట్ర దాగుందా ? చేయించింది ఎవరని మీరు అనుకుంటున్నారు ?