Viral News: మార్కెట్‌లో భార్య‌ను 19 సార్లు పొడిచి…

Viral News: అక్ర‌మ సంబంధం పెట్టుకుందేమో అన్న అనుమానంతో మార్కెట్ న‌డి బొడ్డులోనే భార్య‌ను 19 సార్లు పొడిచి చంపాడు ఓ భ‌ర్త‌. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌ఖ్‌నౌలో చోటుచేసుకుంది. బ్రిజ్ మోహ‌న్ అనే 50 ఏళ్ల వ్య‌క్తి.. కొంత‌కాలంగా త‌న భార్య‌పై అనుమానం పెంచుకున్నాడు. తాను ఇంట్లో లేన‌ప్పుడు త‌న భార్య ఎవ‌రితోనో మాట్లాడుతోంద‌ని అనుకుంటున్నాడు. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రూ క‌లిసి స్థానిక కూర‌గాయ‌ల మార్కెట్‌కు వెళ్లిన‌ప్పుడు గొడ‌వ జ‌రిగింది. కోపంతో బ్రిజ్ మోహ‌న్ క‌త్తెర‌తో అంద‌రూ చూస్తుండ‌గానే ఏకంగా 19 సార్లు పొడిచి పొడిచి పేగులు బ‌య‌టికి వ‌చ్చేలా చేసి మ‌రీ చంపేసాడు. ఈ ఘ‌ట‌న అంతా అక్క‌డి సీసీటీవీలో రికార్డ్ అవ్వ‌డంతో వైర‌ల్‌గా మారింది. పోలీసులు వెంట‌నే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.