EXCLUSIVE: మ‌రో బిగ్ షాక్..!

EXCLUSIVE: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో YSRCPకి మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి పార్టీని వీడ‌నున్నారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో  (pawan kalyan) బాల‌శౌరి ఈరోజు నాలుగు గంట‌ల స‌మ‌యంలో భేటీ కానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో గుంటూరులోని బాల‌శౌరి అధికారిక కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. ఈయ‌న జిల్లాలోనే బ‌ల‌మైన కాపు నాయకుడు కావ‌డంతో ఆయ‌న ఎగ్జిట్ YSRCP పార్టీకి పెద్ద షాకే అని చెప్పాలి. ప‌వ‌న్‌తో భేటీ అయ్యాక ఇత‌ర విష‌యాల‌ను మీడియా ద్వారా వెల్ల‌డిస్తాన‌ని బాల‌శౌరి తెలిపారు.