EXCLUSIVE: మ‌నోళ్లు భ‌య‌ప‌డ్డార‌ట‌..!

EXCLUSIVE: దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి (ys rajasekhar reddy) , ఆయ‌న కుమారుడు, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) చేసిన పాద‌యాత్ర నేప‌థ్యంలో మ‌హి వి రాఘ‌వ్ (mahi v raghav) యాత్ర‌, యాత్ర 2 సినిమాలు తీసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల రిలీజ్ అయిన యాత్ర 2 (yatra 2) ట్రైల‌ర్‌కు కూడా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టుడు మ‌మ్ముట్టి (mammootty), జ‌గ‌న్ పాత్ర‌లో త‌మిళ న‌టుడు జీవ (jeeva) న‌టించారు.

అయితే ఈ సినిమాలో తెలుగు వారిని ఎందుకు తీసుకోలేదు అని నిర్మాత‌ల‌ను అడ‌గ్గా.. మ‌నోళ్లు భ‌య‌ప‌డ్డార‌ట‌. అస‌లే రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశం. ఈ స‌మ‌యంలో ఈ సినిమాలో న‌టిస్తే త‌ర్వాత అస‌లు సినిమాలు చేసే అవ‌కాశం కూడా లేకుండాపోతుందేమోన‌ని ఎంత రెమ్యున‌రేష‌న్ ఇస్తామ‌న్నా కూడా వ‌ద్దు అన్న‌ట్లు నిర్మాత‌ల‌తో చెప్పార‌ట‌. అమ‌రావ‌తి ఫైల్స్ (amaravathi files) అనే మ‌రో సినిమా కూడా రాబోతోంది. ఇందులో కూడా ఏపీ సీఎం పాత్ర‌లో ఓ త‌మిళ న‌టుడు న‌టించ‌నున్నాడు.అయితే అత‌ని వివ‌రాలు మాత్రం ఇప్పుడే చెప్ప‌లేమ‌ని నిర్మాత‌లు తెలిపారు.