EXCLUSIVE: YSRCPని వ‌దిలిపోను

EXCLUSIVE: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌ను (gudivada amarnath) జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) గ‌ట్టి షాక్ ఇచ్చారు. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్‌ల‌ను వ్య‌క్తిగ‌తంగా దూషిస్తూ జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేసే అమ‌ర్నాథ్‌కు ఈసారి టికెట్ లేదని తేల్చి చెప్పేసారు. దాంతో ఆయ‌న కంట‌త‌డి పెట్టుకున్నారు.

అన‌కాప‌ల్లిలో YSRCP కొత్త ఇన్‌ఛార్జిగా మ‌ల‌సాల భ‌ర‌త్‌కుమార్‌ను నియ‌మించారు. ఈ నేప‌థ్యంలో ప‌రిచ‌య స‌మావేశాన్ని ఏర్పాటుచేసారు. ఈ సంద‌ర్భంగా అమ‌ర్నాథ్ మాట్లాడుతూ.. అన‌కాప‌ల్లి ప్ర‌జ‌ల రుణాన్ని ఈ జ‌న్మ‌లో తీర్చుకోలేను అంటూ కంట‌త‌డి పెట్టుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టికెట్లు ఇవ్వ‌ర‌ని తెలీడంతో పార్టీని వీడుతున్న నేత‌ల‌పై వెన్నుపోటు పొడ‌వ‌డం కంటే వ‌దిలిపోవ‌డం మంచిది అంటూ వారిపై తెగ కామెంట్స్ గుప్పించారు. ఇప్పుడు వారంతా కూడా అమ‌ర్నాథ్‌పై సెటైర్ వేస్తున్నారు. త‌న‌దాకా వస్తే కానీ త‌మ బాధేంటో తెలీలేదా అంటూ చుర‌క‌లు అంటిస్తున్నారు. అయితే టికెట్ రానంత మాత్రాన పార్టీని వీడ‌తారా అని ప్ర‌శ్నించ‌గా.. అస‌లు తాను ఎక్క‌డా ఆ మాట అన‌లేద‌ని.. YSRCP తోనే ఉంటాన‌ని తేల్చి చెప్పారు.