Janhvi Kapoor: అమ్మ చ‌నిపోయింద‌ని తెలిసిన‌ప్పుడు.. జ‌రిగింది ఇదే

Janhvi Kapoor: అల‌నాటి తార శ్రీదేవి (sridevi) హ‌ఠాన్మ‌రణం యావ‌త్ భార‌త‌దేశాన్ని శోక‌సంద్రంలో ముంచింది. అభిమానులే ఆవిడ మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక‌పోయారు. ఇక కుటుంబం ఎలా విల‌విల‌లాడిపోయి ఉంటుందో చెప్ప‌డానికి మాట‌లు కూడా స‌రిపోవు. అయితే త‌న త‌ల్లి చ‌నిపోయింద‌ని తెలిసిన‌ప్పుడు ఏం జ‌రిగిందో వివ‌రించారు జాన్వి. త‌ను త‌న గ‌దిలో ఉన్న‌ప్పుడు చెల్లెలు ఖుషి క‌పూర్ గ‌ది నుంచి పెద్ద పెద్ద కేక‌లు వినిపించాయ‌ని.. తాను ప‌రిగెత్తుకుంటూ వెళ్లి చూసేస‌రికి ఖుషి ఏడుస్తూ క‌నిపించింద‌ని తెలిపారు. ఖుషి త‌న‌ను చూడ‌గానే ఉన్న‌ట్టుండి ఏడుపు ఆపేసి విష‌యం చెప్పింద‌ని అప్పుడు ఖుషినే త‌న‌ని ఓదార్చింద‌ని అన్నారు. అమ్మ చ‌నిపోయిన‌ప్ప‌టి నుంచి ఖుషి కళ్ల‌ల్లో నీరు ఆగిపోయింద‌ని.. ఎప్పుడ‌న్నా బాధ‌గా అనిపిస్తే మ‌న‌సారా ఏడ‌లేక‌పోతోంద‌ని తాను కూడా క‌న్నీళ్ల‌తో రోజూ పోరాడుతూనే ఉన్నాన‌ని చెప్పారు జాన్వి.