Ayodhya: గోద్రా త‌ర‌హా దాడి జ‌రిగే అవ‌కాశం?

Ayodhya: అయోధ్య రామ మందిరంలో రామ‌య్య విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ఠ వేడుక త్వ‌ర‌లో ఈ నెల 22న జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, అమిత్ షాల‌తో పాటు ప‌లువురు రాజ‌కీయ సినీ ప్ర‌ముఖుల‌కు కూడా ఆహ్వానం అందింది. అయితే ఈ రామ మందిర నిర్మాణాన్ని దైవ భ‌క్తి అంశంలా కాకుండా.. రాజ‌కీయ అంశంగా మారుస్తున్నార‌ని ఇది మంచి విష‌యం కాద‌ని అన్నారు కర్ణాట‌క కాంగ్రెస్ నేత బీకే హ‌రిప్ర‌సాద్. కార్య‌క్ర‌మానికి వెళ్లేవారికి పూర్తి స్థాయిలో భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని.. గోద్రా త‌ర‌హా సంఘ‌ట‌న జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న హెచ్చ‌రిస్తున్నారు. త‌న‌కు మోదీ మ‌తం ఏదో ఇప్పటికీ తెలీద‌ని.. ఇక అమిత్ షాకు అస‌లు మ‌తం అంటే ఏంటో కూడా తెలీద‌ని.. ఈ అయోధ్య వ‌ల్ల ముందు ముందు అల్ల‌ర్లు జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు చేసారు.