Guntur Kaaram: ఆ కుర్చీని మ‌డ‌త‌పెట్టి….

Guntur Kaaram: సినిమాల నుంచి మీమ్స్ వ‌చ్చాయి అనుకుంటుంటే.. ఇప్పుడు ఆ మీమ్స్‌నే సినిమాల్లో డైలాగులుగా పాట‌లుగా వాడేస్తున్నారు. నితిన్ (nithin) న‌టించిన ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ (extraordinary man)  సినిమా మొత్తం మీమ్‌ల‌తో తీసిన‌దే. ఇప్పుడు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu) న‌టిస్తున్న గుంటూరు కారం సినిమాలో ఓ ఫేమ‌స్ మీమ్‌ను పాట‌గా పెట్టేసాడు త‌మ‌న్ (thaman).

ఇంత‌కీ ఏంటా మీమ్ అనుకుంటున్నారా..? అదేనండీ ఓ తాత ఓ యాంక‌ర్ ముందు త‌న ల‌వ్ స్టోరీ చెప్తూ ఆ కుర్చీని మ‌డ‌త‌పెట్టి దె*** మెడ‌లు ఇరిగిపోయినైయ్ అంటాడు చూడండి. దానిని త‌మ‌న్ గుంటూరు కారంలో మాస్ సాంగ్‌లా వాడేసారు. ఆ సాంగ్ కుర్చీని మ‌డ‌త‌పెట్టి అని మొద‌లవుతుంద‌ట‌. ఒక‌వేళ పాట‌లో ఏద‌న్నా తేడా వ‌స్తే ఇదే డైలాగ్ ఫ్యాన్స్ త‌మ‌న్ అన్న‌తో చెప్పేలా ఉన్నారు