Chandrababu Naidu: ఇప్పుడు ఎదురుక‌ట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు.. రోజులు మారాయ్‌!

Chandrababu Naidu: తెలుగు దేశం పార్టీ (TDP) అధినేత చంద్ర‌బాబు నాయుడు బెంగ‌ళూరులో ఏర్పాటుచేసిన స‌మావేశంలో అక్క‌డి తెలుగు దేశం పార్టీ మ‌ద్ద‌తుదారుల‌తో మాట్లాడారు. గ‌తంలో ఆడ‌పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పించ‌కుండా వ‌య‌సు రాగానే పెళ్లిళ్లు చేసేవార‌ని ఆడ‌పిల్ల‌లు చ‌దుకోవాల‌న్న ఉద్దేశంతో వారికి 33% రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాన‌ని తెలిపారు. ఇప్పుడు ఆడ‌పిల్ల‌ల్నే ఇష్ట‌ప‌డి ఎదురుక‌ట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేసుకుంటున్నార‌ని.. ఆనాడు తాను తీసుకున్న నిర్ణ‌యంతో ఈరోజు ఎంతో మార్పు వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. ఇప్పుడు మ‌గ‌పిల్ల‌ల కంటే ఆడ‌పిల్ల‌లే ఎక్కువ అర్జిస్తున్నార‌ని అన్నారు.

తాను డ‌బ్బు, ల‌గ్జ‌రీ జీవితం కోసం రాజ‌కీయాల్లోకి రాలేద‌ని.. త‌ర‌త‌రాల వారు చంద్ర‌బాబు నాయుడు ఏపీ రాష్ట్రం కోసం ఏం చేసారో గుర్తుపెట్టుకోగ‌లిగితే చాల‌ని అన్నారు. చ‌దువుకుని ఉద్యోగాలు చేసే రోజుల నుంచి ఇత‌రుల‌కు ఉద్యోగం క‌ల్పించే దిశ‌గా అడుగులు వేయాల‌ని మార్గ‌నిర్దేశం చేసారు, రానున్న ఎన్నిక‌ల్లో త‌న‌తో క‌లిసి న‌డ‌వాల‌ని అప్పుడే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర భవిష్య‌త్తు బాగుప‌డుతుంద‌ని అన్నారు.