Telangana: రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్.. KYC చేసుకోవాల్సిందేనా?

Telangana: తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చిన గ్యారెంటల్లో రూ.500ల‌కే గ్యాస్ సిలిండ‌ర్ (gas cylinder) ప‌థ‌కం కూడా ఉంది. అయితే ఈ గ్యాస్ సిలిండ‌ర్ అంశంపై జ‌నాల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. KYC చేసుకుంటేనే రూ.500ల‌కే గ్యాస్ బండ ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఐదు గ్యారెంటీల‌కు సంబంధించి ఈరోజు విడుద‌ల చేసిన ద‌ర‌ఖాస్తు ప‌త్రంలో ఎక్క‌డా కూడా KYC ఆప్ష‌న్ లేదు. మ‌రోప‌క్క KYCతో రాష్ట్ర ప్ర‌భుత్వానికి సంబంధంలేద‌ని అధికారులు అంటున్నారు. అధికారులు ఎంత చెప్తున్నా జ‌నం వినిపించుకోకుండా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత డిపార్ట్‌మెంట్ నుంచి మ‌రింత స్ప‌ష్టత రావాల్సి ఉంది.