ధ‌నుష్‌, మీన‌కి పెళ్లి.. జ‌ర్న‌లిస్ట్ షాకింగ్ వ్యాఖ్య‌లు

సినీ న‌టి మీనా భ‌ర్త చ‌నిపోయి ఏడాది కాకుండానే ఆమె రెండో వివాహం చేసుకోబోతున్నార‌నే పుకార్లు వినిపిస్తున్నాయి. అది కూడా ఎవ‌రో కాదు.. ప్యాన్ ఇండియా స్టార్, కోలీవుడ్ న‌టుడు ధ‌నుష్‌తోన‌ట‌. ధ‌నుష్‌.. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరికి ఇద్ద‌రు కుమారులు. అయితే గ‌తేడాది వీరిద్ద‌రూ విడాకులు తీసుకోబోతున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కానీ పిల్ల‌ల కోసం మాత్ర‌మే భార్యాభ‌ర్త‌లుగా ఉంటామ‌ని, లేదంటే మంచి ఫ్రెండ్స్‌గా ఉంటామ‌ని చెప్పారు. అయితే ఇప్పుడు ధ‌నుష్‌.. మీనాను రెండో వివాహం చేసుకోబోతున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

ఈ పుకార్లు ఎలా వెలువ‌డ్డాయంటే.. ఎప్పుడూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే జ‌ర్న‌లిస్ట్ బ‌యిల్వ‌న్ రంగ‌నాథ‌న్ మీనా, ధ‌నుష్‌లు త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నార‌ని వెల్ల‌డించారు. దాంతో ఆయ‌న వ్యాఖ్య‌ల ప‌ట్ల కోలీవుడ్ ఫ్యాన్స్ షాక‌య్యారు. ఇలాంటి ప‌నికిమాలిన త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేస్తే ఊరుకునేది లేద‌ని మీనా, ధ‌నుష్‌ల అభిమానులు చీవాట్లు పెడుతున్నారు. రంగ‌నాథ‌న్ పాపులారిటీ కోసం ఇలాంటి షాకింగ్ వ్యాఖ్య‌లు చేస్తుంటార‌ని అత‌ని మాట‌లు సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ప‌లువురు నెటిజ‌న్లు సూచిస్తున్నారు. ఇదే విష‌యమై మీనా ఓ సంద‌ర్భంలో స్పందిస్తూ.. “ఇప్ప‌టికీ మావారు నాతో లేర‌న్న విష‌యాన్ని జీర్ణించేకోలేక‌పోతున్నాను. నా గురించి ఇలాంటి వార్త‌లు ఎలా పుట్టిస్తారో అర్థంకావ‌డంలేదు. ప్ర‌స్తుతం నేను నా కూతురికి మంచి భ‌విష్యత్తుని ఇవ్వాల‌నుకుంటున్నాను. మంచి పాత్ర‌లు వ‌స్తే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాల‌ని ఉంది” అన్నారు. మ‌రోప‌క్క ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌లు విడాకులు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న కొన్ని నెల‌లకే నిర్ణ‌యం మార్చుకున్నార‌న్న వార్త‌లు కూడా వ‌చ్చాయి.