Anand Mahindra: “700కి అమ్మితే మేం దివాలా తీయాల్సిందే”

Anand Mahindra: మ‌హీంద్రా సంస్థ‌ల ఛైర్‌ప‌ర్స‌న్ ఆనంద్ మ‌హీంద్రా సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ముఖ్యంగా ట్విట‌ర్‌లో త‌న‌కు న‌చ్చిన అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు అభిప్రాయాల‌ను పంచుకుంటూ ఉంటారు. ఈ నేప‌థ్యంలో మ‌హీంద్రాకు ఓ చిన్నారి నుంచి రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్ ఏంటంటే.. త‌న‌కు థార్ జీప్ కావాల‌ట‌. పైగా రూ.700కే ఆ జీపు కావాల‌ని త‌న తండ్రిని అడుగుతుంటే ఆ తండ్రి వీడియో తీసి ఆనంద్ మ‌హీంద్రాకు ట్యాగ్ చేసాడు. ఈ వీడియో చూసిన మ‌హీంద్రా స్పందించారు. ఈ చిన్నారి త‌న‌కు ఎంతో న‌చ్చాడ‌ని.. పాపం వాడు అడిగింది ఇవ్వాల‌నే ఉంది కానీ అలా ఇచ్చుకుంటూ పోతే కంపెనీ దివాలా తీస్తుంద‌ని సెటైర్ వేసారు.