Narendra Modi: రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవ‌స‌రం లేదు.. మూడోసారీ నేనే

Narendra Modi: దేశ రాజ్యాంగాన్ని మార్చాల‌న్ని అవ‌స‌రం లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. ఓ మ్యాగ‌జీన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మోదీ మాట్లాడుతూ రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ల అంశం గురించి ప్ర‌స్తావించారు. రాజ్యాంగంలో స‌వ‌ర‌ణ‌లు మార్పులు అవ‌స‌రం లేద‌ని ఇలాంటి మార్పులు చేయ‌కుండానే త‌న ప్ర‌భుత్వం దేశంలో మంచి మార్పు తీసుకురాగ‌లిగింద‌ని తెలిపారు. తాను తీసుకొచ్చిన మార్పులు ప్ర‌జ‌ల జీవితాల్లో కూడా పాజిటివ్ మార్పును తెచ్చింద‌ని ఆ న‌మ్మ‌కంతోనే వారు త‌న‌ను మ‌ళ్లీ ప్ర‌ధానిగా ఎన్నుకుంటార‌ని మోదీ ధీమా వ్య‌క్తం చేసారు.