Rythu Bandhu: ఖాతాలో రూ.18.. అంత డ‌బ్బు ఏం చేయాలో తెలీక కంగారుప‌డుతున్న‌ రైతు

Rythu Bandhu: తెలంగాణలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన 24 గంట‌ల్లో రైతు బంధు వేస్తాం అని ప్ర‌కటించారు. ఇప్పుడేమో ప‌ది ఎక‌రాల లోపు ఉన్న‌వారికే రైతు బంధు వ‌స్తుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఇవ‌న్నీ ప‌క్క‌న‌పెడితే ఓ యాసంగి రైతుకు రూ.18 రైతు బంధు న‌గ‌దు ఖాతాలో ప‌డింది. అది చూసిన రైతు షాక‌య్యాడు. అంత డ‌బ్బు ఏం చేయాలో తెలీక కంగారుప‌డుతున్నాడ‌ట‌.

ఇక నిన్న అయితే రైతుబంధు కింద కేవ‌లం ఒక్క రూపాయే వేసార‌ట‌. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పాండురంగ రెడ్డి అనే రైతుకు 5 ఎకరాలు ఉండగా యాసంగి సీజన్ రైతుబంధు కింద రూ.1 జమ చేసినట్లు మెసేజ్ వచ్చింది. ఇదే మండలంలోని టాంకర అనే గ్రామంలోని ఆంజనేయులు అనే రైతుకు రూ.62 బ్యాంకులో జమ అయినట్లు మెసేజ్ వచ్చింది.