YSRCP: ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం

YSRCP: ఏపీ రాజ‌కీయాల్లో (ap elections) కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో కొంద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేలు త‌మ‌కు ఎక్క‌డ టికెట్లు రాకుండా పోతాయోన‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ముందుగానే సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసి మాట్లాడుకుని ఏదో ఒక‌టి తేల్చుకోవాల‌ని చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఒక్కొక్క‌రుగా జ‌గ‌న్‌ను క‌లిస్తున్నారు. ఉభ‌య‌గోదావ‌రి ఉమ్మ‌డి జిల్లాల‌కు త్వ‌ర‌లో అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేయ‌నున్నారు జ‌గ‌న్. తూర్పు గోదావ‌రిలో 17, ప‌శ్చిమ గోదావ‌రిలో 19 సీట్ల‌పై జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

పోల‌వ‌రం, చింత‌లపూడి, పి.గ‌న్న‌వ‌రం, ప‌త్తిపాడు, పిఠాపురం, జ‌గ్గంపేట‌, రామ‌చంద్ర‌రావు పేట స్థానాల సిట్టింగ్ ఎమ్మెల్యేలు టికెట్ వ‌స్తుందో రాదో అని ఊపిరి బిగ‌ప‌ట్టి ఎదురుచూస్తున్నారు. చెల్లుబోయిన వేణుగోపాల్, విశ్వ‌రూప్‌ల టికెట్ల అంశంలో ఉత్కంఠ నెల‌కొంది. వీరికి టికెట్లు ఇవ్వ‌కుండా ఎంపీ సీట్లు కేటాయించ‌డం కానీ వేరే నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేయించే వీలు కానీ ఉన్న‌ట్లు తెలుస్తోంది.