UK లో క‌నిపించ‌కుండాపోయిన భార‌తీయ విద్యార్ధి

యూకేలోని (uk) లండ‌న్‌లో ఓ భార‌తీయ విద్యార్ధి క‌నిపించ‌కుండాపోయాడు. దాంతో అత‌ని కుటుంబీకులు వెంట‌నే విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్‌ను సంప్ర‌దించారు. భాటియా అనే విద్యార్ధి తూర్పు లండ‌న్‌లో నివ‌సిస్తున్నాడు. ఇత‌ను డిసెంబ‌ర్ 15 నుంచి క‌నిపించ‌కుండాపోయాడు. BJP నేత మ‌జింద‌ర్ సింగ్ స‌ర్సా ట్విట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ భాటియా ఫోటో అత‌ని వివ‌రాల‌ను షేర్ చేసారు.

ఇలాంటి సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయ‌నే భార‌త్ నుంచి పిల్ల‌ల్ని విదేశాల‌కు పంప‌డానికి తల్లిదండ్రులు భ‌య‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల తెలంగాణ‌కు చెందిన ఓ యువ‌కుడిని అమెరిక‌న్ త‌ల‌పై పొడవ‌డంతో అత‌ను చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే.