Metro లో ఇరుక్కున్న డ్రెస్.. మ‌హిళ మృతి

మెట్రోలో  (metro) ప్ర‌యాణించేవారు ఎంత అప్ర‌మ‌త్తంగా ఉండాలో తెలియ‌జెప్పే అంశం ఇది. ఓ మ‌హిళ దుస్తులు మెట్రో త‌లుపు మ‌ధ్య‌లో ఇరుక్కుపోవ‌డంతో ఆమెను ట్రైన్ కొన్ని మీట‌ర్ల వ‌ర‌కు ఈడ్చుకెళ్లింది. ఫ‌లితంగా తీవ్ర గాయాలు కావ‌డంతో ఆమె చికిత్స పొందుతూ చ‌నిపోయింది. ఈ దారుణ ఘ‌ట‌న ఢిల్లీలో (delhi) చోటుచేసుకుంది.

మెట్రో రైల్వే సేఫ్టీ క‌మిష‌న‌ర్ ఈ ఘ‌ట‌నపై పూర్తి స్థాయిలో విచార‌ణ చేప‌డ‌తామ‌ని తెలిపారు. దీనిని బ‌ట్టి చూస్తే మ‌న హైద‌రాబాద్ మెట్రో ఎంతో బెట‌ర్. ప్యాసెంజ‌ర్ వేలు త‌గిలినా.. డోర్ల మ‌ధ్య వ‌స్త్రం ఇరుక్కుంద‌ని తెలిసినా ఆటోమేటిక్‌గా డోర్లు తెరుచుకుంటాయి. ఏదేమైనా మెట్రో ప్ర‌యాణికులు చాలా అప్ర‌త‌మ‌త్తంగా ఉండాలి.