Pushpa 2: షూటింగ్ కోసం రూ.15 ల‌క్ష‌లు పెట్టి బెయిల్?

Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) న‌టిస్తున్న పుష్ప 2 సినిమాలో కేశ‌వ పాత్రలో న‌టిస్తున్న జ‌గ‌దీష్ బండారి (jagadish bandari) అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. త‌న ప్రియురాలి ఆత్మ‌హ‌త్య కేసులో భాగంగా జ‌గ‌దీష్‌ను నిందితుడిగా అనుమానిస్తూ రెండు వారాల క్రితం హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసారు. దాంతో పుష్ప 2 షూటింగ్ ఆగిపోయింది. అప్ప‌టికీ ద‌ర్శ‌కుడు సుకుమార్ (sukumar) త‌న టీంతో క‌లిసి జ‌గ‌దీష్‌ను బెయిల్‌పై రిలీజ్ చేయించేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేసార‌ట‌. కానీ బెయిల్ దొర‌క‌క‌పోవ‌డంతో షూటింగ్ ఆప‌లేక జ‌గ‌దీష్ డూప్‌ని పెట్టి కానిచ్చేస్తార‌ట‌.

షూటింగ్ కోసం రూ.15 ల‌క్ష‌లు పెట్టి బెయిల్?

అయితే సినిమాలో ఒక వ్య‌క్తి పాత్ర కీల‌కం అయిన‌ప్పుడు అత‌ను అక‌స్మాత్తుగా చ‌నిపోవ‌డం వంటివి జ‌రిగితే కొత్త న‌టుడ్ని పెట్టి మొద‌టి నుంచి సినిమా తీయాల్సి ఉంటుంది. అదే ఆ న‌టుడు ఇలా జైలు పాల‌యితే చ‌చ్చిన‌ట్లు బెయిల్‌పై రిలీజ్ చేయించాల్సి ఉంటుంది. ఇందుకోసం మైత్రిమూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు ఏకంగా రూ.15 ల‌క్ష‌లు ఖ‌ర్చుపెట్టి మ‌రీ జ‌గ‌దీష్‌కు బెయిల్ ఇప్పించాల‌ని చూస్తున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఒక‌వేళ ఇదే గ‌న‌క జ‌రిగితే షూటింగ్ కోసం ఒక నిర్మాణ సంస్థ న‌టుడిపై ఇంత ఖ‌ర్చు పెట్టి మ‌రీ బెయిల్ ఇప్పించడం అనేది చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే మొద‌టి సంఘ‌ట‌న అవుతుంది.