Telangana: KCRకి భ‌ద్ర‌త కుదింపు..!

Telangana: తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, గ‌జ్వేల్ ఎమ్మెల్యే KCR భ‌ద్ర‌తను కుదించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు KCR సీఎం కాదు కాబ‌ట్టి స‌గ‌టు ఎమ్మెల్యేకు క‌ల్పించాల్సిన భ‌ద్ర‌త క‌ల్పిస్తే చాల‌ని సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy) ఆదేశాలు జారీ చేసారు. ఇంత‌కుముందు వ‌ర‌కు KCRకు Z+ కేటగిరీ భ‌ద్ర‌త ఉండేది. ఇప్పుడు కాస్తా దానిని Y కేట‌గిరీకి కుదించారు. మాజీ మంత్రుల‌కు కూడా 2+2 భ‌ద్ర‌త‌ను కేటాయించారు. ఇక మాజీ ఎమ్మెల్యేల‌కు పూర్తిగా భ‌ద్ర‌త‌ను తొల‌గించారు.