Kothakota Srinivas Reddy: సినీ ప్ర‌ముఖుల‌కు హైద‌రాబాద్ సీపీ మాస్ వార్నింగ్

Kothakota Srinivas Reddy: కొత్త‌గా బాధ్య‌త‌లు తీసుకున్న హైద‌రాబాద్ సిటీ క‌మిష‌న‌ర్ కొత్త‌కోట శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. డ్ర‌గ్స్ విష‌యంలో ఆయ‌న చాలా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోబోతున్న‌ట్లు తెలిపారు. ఈ నేప‌థ్యంలో డ్ర‌గ్స్ వినియోగిస్తున్న ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. డిమాండ్ ఉంటేనే స‌ప్లై ఉంటుంద‌ని.. వినియోగించేవారు ఉన్నంత కాలం డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా జ‌రుగుతూ ఉంటుంద‌ని తెలిపారు.

సినిమా రంగంలో ప‌బ్స్‌, రెస్టారెంట్ల‌లో ఈ డ్ర‌గ్స్ వినియోగం ఎక్కువ‌గా ఉంది కాబ‌ట్టి ఎక్క‌డిక‌క్క‌డ పెద్ద‌లు స‌మావేశాలు ఏర్పాటుచేసుకుని డ్ర‌గ్స్ అనే మాట వినిపించ‌కుండా చూసుకుంటే బాగుంటుంద‌ని అన్నారు. సినీ పెద్ద‌లు ఈ విష‌యంలో క్షేత్ర‌స్థాయిలో స‌మావేశాలు పెట్టుకోవాలని.. మ‌న‌కెందుకులే అని వ‌దిలేస్తే చ‌ర్య‌లు చాలా క‌ఠినంగా ఉంటాయ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎంత చెప్పినా ఇంకా డ్ర‌గ్స్ వాడ‌తాం… స‌ర‌ఫ‌రా చేస్తాం అని అనుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రం వ‌దిలి వెళ్లిపోవాల‌ని కానీ తెలంగాణ‌లో ఉంటూ ఇలాంటి ప‌నులు చేస్తే మాత్రం ఊరికే వ‌దిలిపెట్ట‌బోమ‌ని హెచ్చ‌రించారు.