Bandi Sanjay: కిష‌న్ రెడ్డికి షాక్.. రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి మ‌ళ్లీ బండికేనా?

Bandi Sanjay:  క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ ఒక‌ప్పుడు BJP తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉండేవారన్న విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఆ ప‌ద‌విని కిష‌న్ రెడ్డికి (kishan reddy) ఇచ్చారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ అధ్య‌క్ష పాద‌విని బండికే ఇవ్వాల‌ని BJP హైకమాండ్ యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 2024లో లోక్ స‌భ ఎన్నిక‌లు (lok sabha elections) జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఎంపీ స్థానాలు పెంచుకునేందుకు BJP ఇలా ఆలోచిస్తోంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.