ఎల్బీనగర్‌ ఫ్లైఓవర్‌ ఇవాళ్టి నుంచే అందుబాటులోకి

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ వద్ద మరో పైవంతెన అందుబాటులోకి రానుంది. వనస్థలిపురం- దిల్‌సుఖ్‌నగర్‌ మార్గంలో ఎల్బీనగర్‌ కూడలి వద్ద ఈ వంతెనను నిర్మించారు. శనివారం సాయంత్రం ఈ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ వంతెన వినియోగంలోకి వస్తే.. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీంతో ఎల్బీనగర్‌ కూడలిని సిగ్నల్‌ ఫ్రీగా మార్చేందుకు రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ వివరాలను మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.