Prabhakar Reddy: తాడిప‌త్రిలో ఉద్రిక్త‌త‌.. జేసీని అడ్డుకున్న పోలీసులు

Prabhakar Reddy: అనంత‌పురంలోని తాడిప‌త్ర వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. టిడ్కో ఇళ్ల వ‌ద్ద వంటా వార్పు అనే కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే ఇందుకు తాడిప‌త్రి పోలీసులు అంగీక‌రించ‌లేదు. ఆయ‌న్ను వెంటనే వెళ్లిపోవాల‌ని లేదంటే లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌భాక‌ర్ రెడ్డితో అస్మిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీకి అనుమ‌తి లేదని పోలీసులు చెప్తున్నా కూడా వారు విన‌క‌పోవ‌డంతో ఘ‌ర్ష‌ణ నెల‌కొంది.