Telangana Results: కాంగ్రెస్‌కి శుభాకాంక్ష‌లు చెప్పిన BRS ఎంపీ

Telangana Results: తెలంగాణలో ఇప్ప‌టివ‌ర‌కు వెల్ల‌డైన ఫ‌లితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఈ నేప‌థ్యంలో BRS  ఎంపీ కేశ‌వ రావు కాంగ్రెస్‌కు ముందుగానే శుభాకాంక్ష‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. “” మ‌నం కాంగ్రెస్‌కు శుభాకాంక్ష‌లు చెప్పి తీరాలి. ఇది చిన్న విష‌యం కాదు. కాంగ్రెస్ గొప్ప విజ‌యాన్ని అందుకుంది. మ‌న పార్టీ ప‌డిపోతోంది. ఇది ఒప్పుకుని తీరాల్సిన అంశం. ఇది ప్ర‌జా తీర్పు “” అని కేశ‌వ రావు మీడియాతో అన్నారు. దాంతో ఆయ‌న‌పై BRS వ‌ర్గాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.