గుండెపోటు వ‌చ్చింద‌ని తెలిసి మాజీ భ‌ర్తనే పెళ్లాడింది..!

Ghaziabad: ఓ జంట కొన్ని కార‌ణాల వ‌ల్ల చ‌ట్ట‌ప్ర‌కారం విడాకులు తీసుకుని ఎవ‌రి జీవితాలు వారు చూసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ వ్య‌క్తికి గుండెపోటు వ‌చ్చింది. ఈ విష‌యం తెలిసి అత‌ని మాజీ భార్య మ‌ళ్లీ ఆయ‌న్నే పెళ్లి చేసుకునేందుకు ముందుకు వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. 2012లో కౌశాంబి జిల్లాకు చెందిన పూజ, విన‌య్‌ల వివాహం జ‌రిగింది. కానీ ఏడాదికే ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చి విడిపోయారు.

విడాకులు తీసుకోవాల‌నుకున్నారు. వీరి విడాకులు వెంట‌నే రాలేదు. దాదాపు ఐదేళ్ల త‌ర్వాత అంటే 2018లో సుప్రీంకోర్టు గ‌డ‌ప తొక్కితే అప్పుడు విడాకులు మంజూరు అయ్యాయి. ఈ నేప‌థ్యంలో 2018లోనే విన‌య్‌కు గుండెపోటు వ‌చ్చింది. ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ కూడా జ‌రిగింది. ఈ విష‌యం పూజ‌కు తెలిసింది. విన‌య్‌తో విడిపోయిన‌ప్ప‌టికీ త‌న మ‌న‌సు విన‌య్‌ను చూడాల‌నే కోరుకుంది. విన‌య్‌తో త‌న‌కు ఇక ఎలాంటి సంబంధం లేద‌ని తెలిసినా అత‌ను హాస్పిట‌ల్‌లో ఉంటే చూసేందుకు వెళ్లింది. పూజ‌ను చూసి వికాస్ కూడా క‌రిగిపోయాడు.

అలా ఒక గంట‌లోనే మ‌ళ్లీ ఇద్ద‌రూ క‌లిసిపోయారు. విడాకుల‌ను రద్దు చేసుకుని వికాస్ డిశ్చార్జ్ అయిన వెంట‌నే పెద్ద‌ల స‌మ‌క్షంలో వివాహం చేసుకున్నారు. చిన్న చిన్న విష‌యాల‌కు అలిగి విడాకుల దాకా తెచ్చుకునేవారికి ఈ జంట ఓ గుణ‌పాఠం లాంటిది.