శ్రీవారు నా ప్రార్ధ‌న‌లు విన్నారు..అందుకే నా శ్రీవారితో ద‌ర్శ‌నం చేసుకున్నా

Nara Bhuvaneswari: ఎప్పుడూ స‌తీస‌మేతంగా శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్లే తాను పోయిన‌సారి ఒంట‌రిగా వెళ్లాల్సి వ‌చ్చింద‌ని.. ఆ స‌మ‌యంలో తాను శ్రీవారితో త‌న బాధ‌లు చెప్పుకున్నాన‌ని అన్నారు నారా భువ‌నేశ్వ‌రి. శ్రీవారు త‌న ప్రార్ధ‌న‌లు విన్నారు కాబ‌ట్టే ఈరోజు త‌న శ్రీవారు చంద్రబాబు నాయుడుతో (chandrababu naidu) క‌లిసి తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వ‌చ్చాన‌ని పేర్కొన్నారు. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో (skill development case) రెగ్యుల‌ర్ బెయిల్ రావ‌డంతో చంద్ర‌బాబు రాజ‌కీయ స‌మావేశాలు, ప్ర‌చారాల్లో కూడా పాల్గొన‌వ‌చ్చ‌ని న్యాయ‌స్థానం తెలిపింది. దాంతో త్వ‌ర‌లో చంద్ర‌బాబు ఇక ప్ర‌చారాల్లో పాల్గొంటార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే నారా లోకేష్ (nara lokesh) త‌న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను మ‌ళ్లీ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.