Nara Lokesh: YSRCP నేత‌లు జైలుకు.. జైల‌ర్‌గా చంద్ర‌బాబు

Nara Lokesh: TDP అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్ కావ‌డంతో నారా లోకేష్ చేప‌డుతున్న యువ‌గ‌ళం  (yuvagalam)పాద్ర యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. ఇటీవ‌ల చంద్ర‌బాబుకు రెగ్యుల‌ర్ బెయిల్ రావ‌డంతో మ‌ళ్లీ లోకేష్ పాద‌యాత్ర‌ను పున ప్రారంభించారు. ఈరోజు రాజోలులోని తాటిపాక‌లో  (thatipaka) లోకేష్ ప్ర‌సంగించారు.

2024లో జ‌రిగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో (ap elections) అధికారంలోకి వ‌చ్చేది తెలుగు దేశం పార్టీ జ‌న‌సేన పార్టీలేన‌ని (tdp-janasena) లోకేష్ తెలిపారు. ఎవ‌రైతే త‌న‌పై త‌న కుటుంబంపై త‌ప్పుడు కేసులు బ‌నాయించారో వారికి వ‌డ్డీతో స‌హా తిరిగిచ్చేస్తాన‌ని స‌వాల్ విసిరారు. తాము అధికారంలోకి వ‌చ్చాక YSRCP నేత‌లు జైలుకే పోతార‌ని.. ఆ జైలుకు జైల‌ర్‌గా ఉండేది చంద్ర‌బాబేన‌ని అన్నారు.