ECI: షాకింగ్.. ఉన్న‌ట్టుండి రైతు బంధు ఉప‌సంహ‌ర‌ణ‌

కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ (ECI) రైతుల‌కు షాక్ ఇచ్చింది. ఈరోజు వారి ఖాతాల్లో ప‌డాల్సిన రైతు బంధు (rythu bandhu) సొమ్మును నిలిపివేసింది. మొన్న‌టివ‌ర‌కు రైతు బంధు సొమ్ము వేయొచ్చ‌ని చెప్పిన ఎన్నిక‌ల సంఘం ఈరోజు నిలిపివేయ‌డంతో BRS ప్ర‌భుత్వం కూడా షాక్‌కు గురైంది. మంగ‌ళ‌వారం రోజున‌ మీ ఫోన్లు టింగు టింగుమంటూ రైతు బంధు డబ్బులు వచ్చి మీ అకౌంట్లో పడతాయి అని నిన్న‌నే మంత్రి హ‌రీష్ రావు (harish rao) మాటిచ్చారు. ఇంత‌లో ఎన్నికల క‌మిష‌న్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.