Narendra Modi: మోదీ గ్యారెంటీ ఇస్తే.. గ్యారెంటీకే గ్యారెంటీ ఇచ్చిన‌ట్లు

Narendra Modi: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈరోజు కామారెడ్డిలో ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. కామారెడ్డిలో వెంక‌ట‌ర‌మ‌ణ రెడ్డి తొలిసారి బ‌రిలోకి దిగ‌నున్నారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా మోదీ ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ.. మోదీ ప్ర‌భుత్వం చెప్పింది చేసి తీరుతుంద‌ని.. మోదీ గ్యారెంటీ ఇస్తే అది గ్యారెంటీకే గ్యారెంటీ ఇచ్చిన‌ట్ల‌ని మాస్ డైలాగ్ కొట్టారు. కాంగ్రెస్, BRS పార్టీలు బీసీల‌కు, ద‌ళితుల‌కు అన్యాయం చేసాయ‌ని తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రిగా ద‌ళితుడిని నియ‌మిస్తాన‌ని KCR అన్నార‌ని.. గెలిచేసాక ఆయ‌నే సింహాసనం ఎక్కి కూర్చున్నార‌ని ఆరోపించారు.