Pawan Kalyan: తెలంగాణ‌లో అధికారం వ‌ద్దు మార్పు కావాలి

Pawan Kalyan: తెలంగాణ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ BJPతో పొత్తు (janasena bjp alliance) పెట్టుకుని తొమ్మిది స్థానాల్లో బ‌రిలోకి దిగ‌నుంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) తొలిసారి తెలంగాణలో ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. వ‌రంగ‌ల్‌లో ఆయ‌న రావు ప‌ద్మ‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేసారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ.. త‌న పార్టీ తెలంగాణ‌లోనే ప్రాణం పోసుకుంద‌ని వచ్చే ఏడాది నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌ర్య‌టించిన‌ట్లే తెలంగాణ‌లోనూ ప‌ర్య‌టిస్తాన‌ని తెలిపారు. త‌న‌కు తెలంగాణ‌లో అధికారం కంటే మార్పు కీల‌క‌మ‌ని పేర్కొన్నారు. ఒకే కుటుంబానికి చెందినవారు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తామంటే కుద‌ర‌ద‌ని.. బీసీ అభ్య‌ర్ధి తెలంగాణ సీఎం అవ్వాల‌న్న త‌న క‌లను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సాకారం చేస్తాన‌ని మాటిచ్చార‌ని తెలిపారు.

బ‌లిదానాల నుంచి పుట్టిన తెలంగాణ ఇంత అవినీతిలో కూరుకుపోతుంద‌ని అస్స‌లు ఊహించ‌లేద‌ని ధైర్యంగా అవినీతి చేసామ‌ని టీవీల ముందు కూర్చుని చెప్తున్నార‌ని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌న‌కు జ‌న్మ‌నిస్తే తెలంగాణ త‌న‌కు పున‌ర్జ‌మ్మ‌నిచ్చింద‌ని అన్నారు. అంద‌రిలాగా అబ‌ద్ధాలు చెప్ప‌లేన‌ని.. పోరాడ‌తాన‌ని మాత్రం చెప్ప‌గ‌ల‌న‌ని పేర్కొన్నారు.