‘భీష్మ’ కాంబినేషన్​ రిపీట్​.. హిట్ కొడ‌తారా?

సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా వరుస సినిమాలు తీస్తున్నారు హీరో నితిన్​. అయితే నితిన్​ సినిమాలన్నింటిలో విజయాలకంటే అపజయాలే ఎక్కువ. ఇక భీష్మ సినిమా తర్వాత నితిన్‌కు సరైన హిట్ దక్కలేదు. ఆ సినిమా తర్వాత నితిన్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. ఇటీవల ఎన్నో ఆశలతో చేసిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా నితిన్‌ను తీవ్రంగా నిరాశపరిచింది.

కథల ఎంపికతోపాటు కాంబినేషన్లోనూ కాస్త జాగ్రత్త పడుతున్న నితిన్​ తాజాగా ఓ సినిమాను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కొత్తవాళ్లతో ప్రయోగాలు చేయడం కంటే హిట్​ ఇచ్చిన డైరెక్టర్​, హీరోయిన్​ తోనే తదుపరి సినిమా చేయనున్నాడు నితిన్​. ఆ కాంబినేషనే నితిన్, రష్మికా మందాన, వెంకీ కుడుముల. ఈ ముగ్గురు కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమా భీష్మ. ఈ సినిమా హిట్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తర్వాత నితిన్‌కు సరైన హిట్‌ లేదు. అంతేకాదు, వీరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని టాక్‌ వచ్చినప్పటి నుంచి అప్‌డేట్స్‌ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే ఈ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఉగాది పండుగ సందర్భంగా ఒక స్పెషల్ వీడియో షేర్ చేశారు మేకర్స్‌. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.
ముగ్గురి కాంబినేషన్‌లో సినిమా ప్రకటిస్తూ దాదాపు 3:55 నిమిషాల వీడియోను విడుదల చేసింది మైత్రీ మూవీ మేకర్స్. ‘ఎవరి మనోభావాలను మేం దెబ్బతీయట్లేదు. మా మనోభావాలను మేమే దెబ్బతీసుకుంటున్నాం’ అనే హెచ్చరికతో వీడియో ప్రారంభమైంది. ఈమధ్య రష్మిక ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటున్న విషయాన్ని కూడా వీడియోలో ప్రస్తావించారు. ‘‘నేను ఒక మాట మాట్లాడితే రెండు, మూడు వివాదాలు తలెత్తుతున్నాయి’’ అని రష్మిక చెబుతారు. అందుకు నితిన్ కౌంటర్‌‌ ఇస్తూ..‘‘అది చాలా బెటర్. నేను ఒక్క హిట్ ఇస్తే రెండు, మూడు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి’’ అని చెప్పుకొచ్చారు.

నితిన్ – వ‌క్కంతం వంశీ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. శ్రీ‌లీల హీరోయిన్‌. ఈ సినిమా ఇప్పుడు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకొంటుంది. మ‌ధ్య‌లో చిన్న చిన్న బ్రేకులు తీసుకొన్నా – ఇప్పుడు ఈ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు నితిన్‌.