వాద‌న‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ కేసును వాడుకున్న పొన్న‌వోలు సుధాక‌ర్..!

Chandrababu Naidu: TDP అధినేత చంద్ర‌బాబు నాయుడుకు భారీ ఊర‌ట ల‌భించింది. ఏపీ హైకోర్టు ఈరోజు ఆయ‌న‌కు రెగ్యుల‌ర్ బెయిల్ ఇస్తున్న‌ట్లు తీర్పు వెల్ల‌డించింది. అయితే చంద్ర‌బాబు నాయుడు త‌ర‌ఫు న్యాయ‌వాదులు ఎలాగైనా బెయిల్ వ‌చ్చేలా వాద‌న‌లు వినిపిస్తుంటే.. ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫు వాదిస్తున్న ఏఏజీ పొన్న‌వోలు సుధాక‌ర్ బెయిల్ రానివ్వ‌కుండా త‌న వంతు వాద‌న‌లు వినిపించారు.

బెయిల్ ఎందుకు ఇవ్వ‌కూడ‌దు అని న్యాయ‌మూర్తి అడిగిన‌ప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ కేసుల‌ను ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో జ‌గ‌న్ కేసులో ఇలాగే బెయిల్ వ‌స్తే సాక్షుల‌ను మాయం చేయ‌డం, ఆధారాలు చెరిపేయ‌డం వంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉన్నందున గ‌తంలో ఓసారి జ‌గ‌న్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వ‌లేద‌న్న విష‌యాన్ని ఉటంకించారు. అయిన‌ప్ప‌టికీ న్యాయ‌మూర్తి చంద్ర‌బాబు త‌ర‌ఫు న్యాయ‌వాదుల వాద‌న‌ల‌తో ఏకీభ‌వించి రెగ్యుల‌ర్ బెయిల్ మంజూరు చేసారు.