KCR: పిచ్చి కుక్క రైఫిల్ రెడ్డి..పిండం ఎవ‌రికి పెట్టాలో ప్ర‌జ‌లే నిర్ణ‌యించాలి

KCR: రేవంత్ రెడ్డిపై (revanth reddy) సీఎం KCR మండిప‌డ్డారు. తెలంగాణ ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా జ‌న‌గామ‌లో ఏర్పాటుచేసిన స‌మావేశంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి KCRకు పిండం పెడ‌తా అంటున్నాడ‌ని.. పిండం ఎవ‌రికి పెట్టాల‌నేది ప్ర‌జ‌లు నిర్ణ‌యిస్తార‌ని పిచ్చి కుక్క‌లు మొరుగుతుంటే వాటిని లెక్క‌పెడ‌తామా అని ప్ర‌శ్నించారు. పార్టీ అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తామో ప్ర‌జ‌ల‌కు చెప్పాలి కానీ పిండం పెడ‌తా బొంద పెడ‌తా అని మాట్లాడ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని మండిప‌డ్డారు. తెలంగాణ ఉద్యమం కోసం ప్ర‌జ‌లు పోరాడుతుంటే రైఫిల్ ప‌ట్టుకుని క‌రీంన‌గ‌ర్‌లో ఆపాల‌ని చూసిన వ్య‌క్తి ఈరోజు ఇలా మాట్లాడితే ఎవ‌రు న‌మ్ముతారు అని అన్నారు. అప్ప‌టినుంచి రేవంత్‌ని రైఫిల్ రెడ్డి అని పిలుస్తున్నార‌ని గుర్తుచేసారు.